Bigg Boss Season-8: హౌజ్‌‌లో ఏం జరుగుతుంది.. టార్గెట్‌గా మణికంఠ.. అప్పుడు యష్మీ ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్

by Anjali |
Bigg Boss Season-8:  హౌజ్‌‌లో ఏం జరుగుతుంది..  టార్గెట్‌గా మణికంఠ.. అప్పుడు యష్మీ ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 1 వ తేదీన ప్రారంభమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున సీజన్-8 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మా టీవీలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంది.

హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్స్ కూడా జరిగాయి. అందులో మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, పృథ్విరాజ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఇకపోతే హౌస్‌లో పాపం నాగ మణికంఠను టార్గెట్ చేశారంటూ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. రీసెంట్‌గా యష్మీని మణికంఠ నామినేట్ చేయడంతో యష్మి అతడ్ని టార్గెట్ చేసి తనను ఫ్రెండ్ కూడా అనొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్ లో కొనసాగినన్ని డేస్ నాగమణికంఠను నామినేట్ చేస్తానని ఛాలెంట్ విసిరింది.

ఇప్పుడు మణికంఠను ప్రేరణ టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మణికంఠను బిగ్‌బాస్ సంచాలకుడిగా ఎంపిక చేశాడు. తర్వాత టాస్క్ ఆడాక నిఖిల్ టీమ్ విన్నర్ అని మణికంఠ చెప్పాడు. దీంతో ప్రేరణకు కోపం వచ్చింది. తొక్కలో సంచాలకుడు అంటూ మాట్లాడింది. మణికంఠ ఎంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నా తను పొగరుగా ప్రవర్తించింది. తర్వాత టాస్క్ సమయంలో అలా మాట్లాడానంటూ వచ్చి మణికంఠను ప్రేరణ హగ్ చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed